Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ హైట్స్, నవోదయ కాలని, నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గంగాధర్ రెడ్డికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ఆచరణీయమని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించిన అవతారమే శ్రీరామచంద్రుడి అవతారం అని అన్నారు.
Also Read : ఐటీ కారిడార్.. అర్థరాత్రి.. మద్యం మత్తులో కారుతో ఐటీ ఉద్యోగి..
శ్రీరాముడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. శ్రీరామనవమి ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. రాముడు చూపించిన ధర్మమార్గం వైపు మనల్ని నడిపిస్తూ కుటుంబం, సమాజం, దేశం పట్ల మన కర్తవ్యాలను, బాధ్యతలను గుర్తు చేసే ఉత్సవం శ్రీరామ నవమి అని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ హిట్స్ కాలనీ వాసులు,నవోదయ కాలనీ వాసులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu