Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ ఉద్యమకారుడు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడు దివంగత కొండకల్ శంకర్ గౌడ్ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘనంగా నివాళులు అర్పించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండకల్ శంకర్ గౌడ్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ తో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తుచేసుకున్న సాయిబాబా, తాను కొండకల్ శంకర్ గౌడ్ ను రాజకీయ గురువుగా బావిస్తానని అన్నారు. తనలాంటి ఎందరికో రాజకీయ అవకాశం కల్పించిన ఘనత శంకర్ గౌడ్ దని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి కొండకల్ శంకర్ గౌడ్ అని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి, తనవంటి ఎందరినో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం శంకర్ గౌడ్ వేసిన పునాది అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల గుండెల్లో కొండకల్ శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలిచి పోతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొండకల్ శంకర్ గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని శేరిలింగంపల్లి పరిధిలో పార్టీ పటిష్టతను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొండకల్ శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన వారిలో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Admin
Ekaburu