Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తన జీవితంలో చివరి క్షణం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ కార్పొరేటర్ సాయిబాబా నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం పరితపించిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు.
Also Read : రహదారుల మీద బైక్ రేసింగ్ లకు పాల్పడితే జైలుకే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రపంచం ముందు వినిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. నేటి యువత ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ అభివృద్ధికి, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు పాటుపడాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో, ఆయన చూపిన బాటలో ఉద్యమం నడిపించిన కెసిఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ ను చిరకాలం గుర్తుంచుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సతీష్ ముదిరాజ్, నారాయణ, రమేష్ గౌడ్, తాహేర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu