Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన గచ్చిబౌలి డివిజన్ ప్రజల ఋణం తీర్చుకుంటానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో పలు అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన సొంత డబ్బు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు గోపన్ పల్లి కార్యాలయంలో గురువారం డాక్టర్స్ కాలనీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డికి అందజేశాడు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని సదుపాయాలను ఉపయోగించుకుంటానని అన్నారు.
Also Read : ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ
ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం, తనకు చేతనైనంత మేర స్వంత నిధులతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపడుతామని అన్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, తనపై నమ్మకం ఉంచి, కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన డివిజన్ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనే గచ్చిబౌలిని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సంయుక్త కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu