Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని మజీద్ బండ లో గల అనిల్ కుమార్ యాదవ్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువజన నాయకులు భారీ పూలహారాన్ని అనిల్ కుమార్ యాదవ్ కు వేయడం ప్రత్యేకతగా నిలిచింది.
Also Read : టెక్ దిగ్గజ కార్యాలయంలో నల్లుల బెడద
అనంతరం అనిల్ కుమార్ యాదవ్ ఆటో యూనియన్ కార్మికులకు యూనిఫామ్ లను అందజేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజసేవే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం రాజకీయాలకు ఆతీతంగా కృషి చేస్తానని తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.
Admin
Ekaburu