Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ లో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఓ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వద్ద 250 కోట్ల విలువైన ఆస్తులు బయటపడడం ఈ శాఖలో అవినీతి ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో కళ్లకు కడుతుంది. హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఎం.కిషన్ నాయక్ మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ లు చేశారు.
Also Read : ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్
ఇతనికి నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో 1.37 కోట్ల రూపాయల నగదు, అశోక్ టౌన్ షిప్లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. కిషన్ నాయక్ తో పాటు ఆయన బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకోగా.. బహిరంగ మార్కెట్ లో వాటి విలువ రూ.250 కోట్లు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Admin
Ekaburu