Sunday, 01 March 2026 11:22:22 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు

కిటికీ గ్రిల్ తొలగించి 50 ల్యాప్ టాప్ ల చోరీ

Date : 09 February 2026 10:25 PM Views : 78

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ""చుట్టూ రక్షణ ప్రహరీ గోడ... ఉన్న మూడు గేట్ల ద్వారానే లోపలికి వెళ్లే అవకాశం... గేట్ల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ... వర్సిటీ వర్గాలకు తప్పితే ఇతరులెవరికి (కనీసం రాజకీయ నాయకులు, మీడియాకు సైతం) అనుమతి లేదు.. కానీ ఇంతటి బందోబస్తు మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోరీ జరిగింది... ఏకంగా క్లాస్ రూమ్ లో ఉన్న 50 లాప్ టాప్ లను దుండగులు చంకలో పెట్టుకొని పరారయ్యారు. ""

Also Read : కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చోటుచేసుకున్న చోరీ ఘటన సంచలనంగా మారింది.. శుక్రవారమే యూనివర్సిటీకి తెచ్చి క్లాస్ రూమ్ లో పెట్టిన లాప్ టాప్ లు ఆదివారం చోరికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గల సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగం తరగతి గదిలోకి కొత్తగా శుక్రవారం 50 లాప్ టాప్ లు తెచ్చి పెట్టారు. కాగా ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి సదరు గదిలోకి ప్రవేశించారు. క్లాస్ రూమ్ లో ఉన్న 50 ల్యాప్ టాప్ లను దుండగులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. తరగతి గదిలో ల్యాప్ టాప్ లు మాయం కావడం సోమవారం ఉదయం గమనించిన వర్సిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు తరగతి గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వివరాల కోసం వర్సిటీలోని సిసి కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు. కాగా సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగం తరగతి గదిలో భారీ ఎత్తున ల్యాప్ టాప్ లు ఉన్నాయని తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సదరు విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, విద్యార్థుల వివదాలను మొత్తం సేకరిస్తున్నారు. కాగా మొత్తం 50 ల్యాప్ టాప్ లు చోరీకి గురికావడంతో చోరీలో పాల్గొన్న వారు ఒక్కరు అయ్యే అవకాశం లేదని, ఎక్కువ మంది కలిసి ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా చోరికి గురైన లాప్ టాప్ లు శుక్రవారం రోజే వర్సిటీకి తీసుకురాగా, వీటి విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు. నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :