Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్ డిపోలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో డిపోలో గల చెత్త డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున పొగ, మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్ డిపోలో ఓ వైపు ఖాళీ స్థలాన్ని చెత్త డంపింగ్ కు ఉపయోగిస్తున్నారు. కాగా ఈ ఖాళీ ప్రదేశంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో వేసిన చెత్తకు మంటలు అంటుకోవడంతో డంపింగ్ యార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికంగా దట్టమైన పొగ పేరుకుపోయి, మంటలతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మెట్రో డిపో నిర్వాహకులు పోలీసులు, పైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి పైరింజన్ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
Also Read : 'ఉడతా సైబరాబాద్' - విద్యార్థులు, ఉద్యోగులే టార్గెట్
Admin
Ekaburu