Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ లో ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీ లో పక్కపక్క ఇళ్లలో ఉండే వారి మధ్య సౌండ్ పొల్యూషన్ చిచ్చు రాజేసింది. తన విల్లాలో చెవులు చిల్లులు వడే సౌండ్ పెట్టి, మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని సౌండ్ అవమని వక్క విల్లాలో ఉండే వ్యక్తి అడగడం ఘర్షణకు దారితీసింది. ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. సౌండ్ ఆపమని అడిగినందుకు కుర్చీతో దాడి చేసి గాయపర్చడంతో బాధితుడు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐటి కారిడార్ పరిధిలోని ఖాజాగూడ బ్లూమ్ ఫీల్డ్ విల్లా నెంబరు 16లో సూర్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ విల్లా పక్కనే ఉన్న విల్లా నెంబరు 6లో రాజేంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటుండగా, ప్రతి రోజు రాజేంద్రన్ ఎక్కువ సౌండ్ పెట్టి మ్యూజిక్, పాటలతో ఎంజాయ్ చేస్తుంటాడు. కాగా సౌండ్ కారణంగా ఇబ్బంది పడిన సూర్య ఆదివారం సౌండ్ అపమని ఆడిగేందుకు రాజేంద్రన్ విల్లాకు వెళ్లాడు. నా ఇంటికి వచ్చి, నన్నే సౌండ్ ఆపమంటావా అంటూ ఆగ్రహించిన రాజేంద్రన్ కుర్చీతో సూర్య మీద దాడి చేశాడు. ఈ ఘటనలో సూర్య తలకు తీవ్ర గాయం కాగా, సూర్య భార్య రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Ekaburu