Wednesday, 22 April 2026 09:03:55 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

బ్లూమ్ ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో సౌండ్ పొల్యూషన్ వివాదం

సౌండ్ ఆపమన్నందుకు పక్క విల్లా వ్యక్తిపై దాడి

Date : 12 August 2024 06:35 AM Views : 964

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఐటీ కారిడార్ లో ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీ లో పక్కపక్క ఇళ్లలో ఉండే వారి మధ్య సౌండ్ పొల్యూషన్ చిచ్చు రాజేసింది. తన విల్లాలో చెవులు చిల్లులు వడే సౌండ్ పెట్టి, మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని సౌండ్ అవమని వక్క విల్లాలో ఉండే వ్యక్తి అడగడం ఘర్షణకు దారితీసింది. ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. సౌండ్ ఆపమని అడిగినందుకు కుర్చీతో దాడి చేసి గాయపర్చడంతో బాధితుడు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఐటి కారిడార్ పరిధిలోని ఖాజాగూడ బ్లూమ్ ఫీల్డ్ విల్లా నెంబరు 16లో సూర్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ విల్లా పక్కనే ఉన్న విల్లా నెంబరు 6లో రాజేంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటుండగా, ప్రతి రోజు రాజేంద్రన్ ఎక్కువ సౌండ్ పెట్టి మ్యూజిక్, పాటలతో ఎంజాయ్ చేస్తుంటాడు. కాగా సౌండ్ కారణంగా ఇబ్బంది పడిన సూర్య ఆదివారం సౌండ్ అపమని ఆడిగేందుకు రాజేంద్రన్ విల్లాకు వెళ్లాడు. నా ఇంటికి వచ్చి, నన్నే సౌండ్ ఆపమంటావా అంటూ ఆగ్రహించిన రాజేంద్రన్ కుర్చీతో సూర్య మీద దాడి చేశాడు. ఈ ఘటనలో సూర్య తలకు తీవ్ర గాయం కాగా, సూర్య భార్య రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :