Saturday, 18 April 2026 07:11:05 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

నిరుద్యోగులను ముంచిన దొంగ ప్రేమజంట

పోలీసు అధికారినంటూ రూ.3 కోట్లకు కుచ్చుటోపీ

Date : 09 March 2024 10:19 PM Views : 892

Ekaburu - క్రైమ్ / : నిరుద్యోగులను నమ్మించడం కోసం ఏకంగా నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు ఓ కేటుగాడు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు దిగి, పోలీస్ అధికారిగా చలామణీ అవుతూ నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. ఈ నకిలీ పోలీసు అధికారికి అతని ప్రియురాలు సైతం జతకలిసి ఉద్యోగుల కోసం చూస్తున్న అమాయకులను బురిడీ కొట్టించారు. పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగులమని నిరుద్యోగుల్ని నమ్మించిన ఈ ప్రేమజంట పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 30మంది నుంచి రూ.3కోట్ల రుపాయలు వసూలు చేశారు. వీరి మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

Also Read : టాటా టెక్నాలజీస్ తో తెలంగాణ ప్రభుత్వ ఏంఓయూ

నిందితుడు హనుమంతు రమేష్ గతంలో సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన హనుమంతు రమేష్ గతంలో గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. రమేష్ కొన్నిరోజుల పాటు తన ప్రియురాలితో కలిసి విశాఖపట్నం అడవివరం ఆర్ ఆర్ టవర్స్ లో నివాసం ఉన్నాడు. ఈ సమయంలో తన ప్రియురాలితో కలిసి పోలీసు అధికారినంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. ప్రియురాలితో కలిసి పోలీసు యూనిఫాంలో నిరుద్యోగులను కలిసి, తాను పోలీసు అధికారినంటూ నమ్మించేవాడు. వీరికి మధ్యవర్తులు సైతం సహాయం చేశారు. 3కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్ లో తలదాచుకున్న ఈ ప్రేమజంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు రమేష్‌ గతంలో ఇద్దరు అక్కా, చెల్లెళ్లను పెళ్లి చేసుకోగా, ప్రస్తుతం తన ప్రియురాలితో నివాసం ఉంటూ నేరాలకు పాల్పడినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :