Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఈ-కబురు, శేరిలింగంపల్లి : ఐటీ కారిడార్లో ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోకి చొరబడ్డ నలుగురు దొంగలు విల్లాస్లో చోరి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చోటుచేసుకుంది. కొండాపూర్ వెసెల్లా వుడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో 82 విల్లాస్ ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.17 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించారు. విల్లాస్ డోర్ బ్రేక్ చేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. నడుస్తున్న శబ్దాలు వినిపించకుండా తమ చెప్పులు చేతుల్లో పట్టుకొని, ముఖానికి మాస్కులు ధరించి విల్లాల ముందు తిరిగారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయారు.
Also Read : గచ్చిబౌలి నిథిమ్ లో చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణం కూల్చివేత
ఈ సంఘటన మొత్తం విల్లాస్ ముందు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే గేటెడ్ కమ్యూనిటీ... పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్న కూడా దొంగలు విల్లాస్లోకి ప్రవేశించి దర్జాగా తిరగడంపై విల్లాస్ యజమానులు కమ్యూనిటీ మేనేజ్మెంట్పై అగ్రహం వ్యక్తం చేశారు. వేలకు వేలు మెయింటెనెన్స్ తీసుకుంటూ సరైన భద్రత కల్పించడంలో విల్లాస్ మేనేజ్మెంట్ విఫలమయ్యిందని ఆరోపించారు. వెసెల్లా వుడ్స్ విల్లాస్లో చోరియత్నంపై ఏలాంటి ఫిర్యాదు రాలేదని మియాపూర్ పోలీసులు తెలిపారు.
Admin
Ekaburu