Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : వట్టినాగులపల్లిలో ఓ పేయింటింగ్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. పేయింటింగ్ కూలీలతో డబ్బుల విషయంలో జరిగిన గోడవలే హత్యకు దారితీశాయి. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వలస వచ్చిన రాజ్ కుమార్ వట్టినాగులపల్లిలో నివాసం ఉంటూ పెయింటింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. తనతో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి ఆరుగురు వ్యక్తులన తీసుకువచ్చి పెయింటింగ్ కూలీలుగా తనవద్ద పనికి పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా రాజ్ కుమార్ కూలీలకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాజ్ కుమార్ కూలీలతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో కూలీలతో రాజ్ కుమార్ కు గొడవ జరిగింది. అనంతరం కూలీలు తమ గదిలో, రాజ్ కుమార్ వరండాలో నిద్రపోయారు. అర్థరాత్రి కూలీలలో ఒకరైన రాంసింగ్ ఇనుప సుత్తితో రాజ్ కుమార్ తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఇంటి యజమాని సమాచారం తో పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Ekaburu