Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందింది. పటన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు మీద లాస్య నందిత ప్రయాణిస్తున్న ఎక్స ల్ 6 కారు అదుపు తప్పి ఔటర్ రైలింగ్ ను ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి సదాశివ పెట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత.తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది ఇదే నెలలో లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందాడు.
Admin
Ekaburu