Sunday, 01 March 2026 12:55:02 PM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

ఐటీ కారిడార్ నడిబొడ్డున డ్రగ్స్, విదేశీ మద్యంతో 'రేవ్ పార్టీ

రేవ్ పార్టీలో పాల్గొన్న 14 మంది యువకులు, 6గురు యువతులు

Date : 26 July 2024 12:30 AM Views : 917

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐటీ కారిడార్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ గుట్టు రట్టయింది. ఈ జల్సారాయుళ్లు ఏకంగా మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీని ఏర్పాటు చేసి ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కారు. రేవ్ పార్టీ చేసుకుంటూ మొత్తం 14మంది యువకులు, 6గురు యువతులు పట్టుబడగా, వీరివద్ద నుంచి విదేశీ మద్యం,1 గ్రాము కొకైన్, 2 గ్రాముల ఏండీఏంఏ డ్రగ్, 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ కు చెందిన నాగరాజు యాదవ్ అనే వ్యక్తి తన జన్మదినం పురస్కరించుకొని రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు.

Also Read : అమెరికా మాస్టర్స్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జగ్జీవన్ రెడ్డికి ఘనస్వాగతం

మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలోని క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించగా, పార్టీలో మొత్తం 14 మంది యువకులు,6 గురు యువతులు పాల్గొన్నారు. పక్కా సమాచారం తో క్లౌడ్ 9 అపార్టుమెంటు మీద దాడి చేసిన రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు మొత్తం 1.25 లక్షల విలువైన డ్రగ్స్, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో 5గురు యువకులను అరెస్టు చేసి, ఓ ఇన్నోవా క్రిస్ట కారును స్వాధీనం చేసుకున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :