Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీ కేసు లో మరో టర్నింగ్ పాయింట్... ఓవైపు పోలీసులు అజ్ఞాతంలో ఉన్న నిందితుల కోసం నోటీసులు జారీ చేసి గాలింపు చేపడుతుండగా, మరోవైపు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నీల్ విదేశాలకు పారిపోవడం మరింత సంచలనంగా మారింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో మొత్తం పదిమంది పాల్గొనగా ఫిబ్రవరి 25వ తేదీన డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానందను, సినీ నిర్మాత కేదారినాథ్, వ్యాపారి నిర్భయ్ లను అరెస్టు చేశారు. అనంతరం వీరికి కొకైన్ సరఫరా చేసిన అబ్బాస్ ను అరెస్టు చేయగా, బుధవారం అబ్బాస్ కు డ్రగ్స్ ఇచ్చిన వహీద్ బేగ్ ను, వివేకానంద కు డ్రగ్స్ చేరవేయడంలో సహాయం చేసిన అతని డ్రైవర్ ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు రఘు చరణ్ గురువారం పోలీసు విచారణకు హాజరయ్యాడు.
Also Read : సింగర్ చిన్మయి మీద గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు
కాగా ఈ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్, నటి లిషి గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, నీల్ లు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు వీరికి 160 సీఆర్పిసీ నోటీసులు జారీ చేశారు. కాగా నిందితులల్లో ఒకరైన నీల్ విదేశాలకు పారిపోయినట్టు తెలుసుకొని పోలీసులు కంగుతిన్నారు. నీల్ దేశం దాటడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు లో నిందితుడు మొదట రాష్ట్రం దాటడం, ఇప్పుడు దేశం దాటి పోవడం సంచలనంగా మారింది. నీల్ దేశం దాటడానికి ఎవరు సహకరించారు, ఎవరి మద్దతుతో నీల్ దేశం దాటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Admin
Ekaburu