Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : కట్టుదిట్టమైన భద్రత మధ్య, బహుళజాతి సంస్థలతో అలరారే గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఉడతా సైబరాబాద్ గా మారుతోంది. నిరంతర నిఘా, పటిష్టమైన బందోబస్తు ఉండే ఐటీ కారిడార్ లో నిత్యావసర వస్తువుల కంటే విరివిగా గంజాయి లభిస్తుంది. ఐటీ కారిడార్ లో చిన్న చిన్న హోటళ్లు, కిరాణా షాపులు గంజాయి కేంద్రాలుగా మారుతున్నాయి. ఐటీ కారిడార్ లో తరచూ వెలుగుచూస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతకొన్ని రోజుల క్రితమే లేడీ గంజాయి డాన్ ను పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా మరో మహిళ గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. కిరాణా షాపును స్థావరంగా మార్చుకుని విద్యార్థులు, ఉద్యోగులకు గంజాయి విక్రయిస్తుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం...
Also Read : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ బిజెపి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని నానక్ రాంగూడ లోథా బస్తీలో నివాసం ఉండే అనురాధా భాయి(39) తన కిరాణా షాపులో గంజాయి అమ్ముతుంది. దుకాణం నిర్వహిస్తుంది. దూల్ పేట నుంచి పెద్దమొత్తంలో గంజాయి తీసుకువచ్చి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఎక్కువ ధరకు స్థానికంగా విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలకు విక్రయించసాగింది. అనురాధా భాయి గంజాయి వ్యాపారంపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కిరాణా దుకాణం మీద దాడి చేశారు. ఈ దాడిలో 20వేల రూపాయల విలువైన 300 గ్రాముల(39 ప్యాకెట్లు) గంజాయిని, నగదు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అనురాధాభాయిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu