Saturday, 18 April 2026 07:12:04 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

రాడిసన్ హోటల్ పై చర్యలకు సిద్ధమైన పోలీసులు

డ్రగ్స్ పార్టీల ఫలితం

Date : 03 March 2024 12:32 AM Views : 920

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : డ్రగ్స్ పార్టీ కేసులో గచ్చిబౌలి పోలీసులు మరిన్ని కేసులకు సిద్ధం అవుతున్నారు. ఇష్టారాజ్యంగా హోటల్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన రాడిసన్ బ్లూ హోటల్ యాజమాన్యం మీద కేసు నమోదుకు యోచిస్తున్నారు. ఈ మేరకు నోటీసులు సిద్ధం చేసిన గచ్చిబౌలి పోలీసులు వాటిని రాడిసన్ యాజమాన్యానికి అందజేసి కేసు నమోదు చేయనున్నారు. హోటల్ యజమాని కుమారుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద తన సొంత హోటల్ లో విచ్చలవిడిగా డ్రగ్ పార్టీలు నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు సిద్దమయ్యారు.

Also Read : ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

డైరెక్టర్ క్రిష్ రిపోర్ట్ నెగటివ్... డ్రగ్స్ పార్టీలో పాల్గొని, కొకైన్ తీసుకున్నాడని అభియోగాలతో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ యూరిన్ శాంపిల్ పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. క్రిష్ తో పాటు ఈ కేసులో మరో నిందితుడు చరణ్ శాంపిల్ సైతం నెగటివ్ వచ్చింది. ఆరు రోజుల తరువాత శాంపిల్ తీసుకున్న కారణంగానే నెగటివ్ వచ్చి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి బ్లడ్ శాంపిల్ ను కోర్టు అనుమతితో ఎఫ్ఎస్ఎల్ కు పంపనున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగానే కొకైన్ సేవించారా లేదా అని తుది నిర్ణయానికి రానున్నారు. మరోవైపు డ్రగ్స్ సరఫరాదారు మరొకరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్టు వహిద్ పోలీసు విచారణలో చెప్పడంతో ఎఫ్ఐఆర్ లో పోలీసులు అబ్దుల్ పేరు చేర్చారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :