Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల సంతకాలను పోర రీ చేసిన ఓ ఉద్యోగి ఏకంగా 52 లక్షల వర్సిటీ నిధులను దారి మళ్లించాడు. వర్సిటీ ఆడిట్ లో విషయం వెలుగుచూడగా, యూనివర్సిటీ ఉన్నతాధికారులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం... గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అకౌంట్స్ సెక్షన్ లో పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ ఉర్దూ యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్ లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని భారీ కుట్రకు తెరలేపాడు. ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా 52లక్షల రూపాయల నిధులను తన ఖాతాకు మళ్లించాడు. ఇటీవల జరిపిన ఆడిట్ లో ఈ కుట్రను యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో జాకీర్ హుస్సేన్ ఈ కుట్రకు పాల్పడినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. అనంతరం నిధుల గోల్ మాల్ విషయమై రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన జాకీర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read : అక్రమ నిర్మాణం... ప్రమాదకరం... పరిసరాలు అంధకారం
Admin
Ekaburu