Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : తాను నివాసం ఉంటున్న హాస్టల్ భవనం మంచినీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయి ఓ ఐటీ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. వర్కింగ్ హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సంపు మూతను తీసి ఉంచడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ అక్మల్ సువుయాన్(25) ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చాడు. ఐటి కారిడార్ పరిధిలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ గచ్చిబౌలి అంజయ్యనగర్ లోని షణ్ముఖ్ మెన్స్ పిజి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. హాస్టల్ నిర్వాహకులు సోమవారం ఉదయం భవనం సెల్లార్ లో ఉన్న మంచినీటి సంపును తెరిచి మోటార్ వేశారు. అదే సమయంలో ఉదయం 10.30కు టిఫిన్ తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన సుఫుయన్ తిరిగి హాస్టల్ కు వచ్చాడు.
Also Read : చేవెళ్ల గడ్డపై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ నమోదు చేస్తాం: సాయిబాబా
తెరిచి ఉన్న సంపు మూతను చూసుకోకుండా లోపలికి వచ్చిన సుపుయన్ అందులో పడిపోయాడు. టిఫిన్ కోసం బయటకు వెళ్లిన సువుయాన్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానంతో మంచినీటి సంపులో గాలించగా, అప్పటికే మృతిచెందిన అక్మల్ సుఫుయాన్ మృతదేహం కనిపించింది. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సుఫుయాన్ మృతదేహాన్ని సంపులో నుండి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మంచినీటి సంపు మూత తీయడంతో పాటు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై హాస్టల్ నిర్వాహకుడు మధుసూధన్ రెడ్డి మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu