Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం 30వ అంతస్థు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందగా, రక్షణ చర్యలు తీసుకోకుండా పనులు చేపడుతున్న కెఎల్ సీ నిర్మాణ సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పశ్చిమ బెంగాల్ కు చెందిన ఖైరూల్ మియా(32) గత పదిహేను రోజుల క్రితం బంధువు మత్యుర్ మండా తో కలిసి నగరానికి వచ్చాడు. లింగంపల్లిలో క్యాండూర్ క్రిసెంట్ పేరుతో భారీ బహుళ అంతస్థుల నిర్మాణం చేపడుతున్న కెఎల్ సీ సంస్థ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం 30వ అంతస్థులో పనిచేస్తూ ఖైరూల్ 11వ అంతస్థుకు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో ఖైరూల్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్మికుడి మృతికి కారణమైన కెఎల్ సీ సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu