Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ శుక్రవారం పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగగా, అర్థరాత్రి పోలీసులు హోటల్ మీద దాడి చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న దర్శకుడు క్రిష్ మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి క్రిష్ పరారీలో ఉన్నాడు. క్రిష్ మీద పోలీసులు 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి గాలింపు చేపట్టారు. కాగా తనకు ముందస్తు బెయిల్ కోసం తన న్యాయవాదితో శుక్రవారం ఉదయం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న క్రిష్, సాయంత్రం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరయ్యాడు.
Also Read : ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనలో తిరిగి చేరిన తెలంగాణ రాష్ట్రం
క్రిష్ ను విచారించిన పోలీసులు, న్యాయవాది సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో క్రిష్ కొకైన్ తీసుకున్నట్టు తేలితే పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, టాలీవుడ్ నిర్మాత కేదారినాథ్, వ్యాపారి నిర్భయ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్స్ సరఫరాదారులు అబ్బాస్, వహిద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు నటి లిషి గణేశా, యూట్యూబర్ శ్వేత, సందీప్, నీల్ లు పరారీలో ఉన్నారు. వీరిలో నీల్ విదేశాలకు పారిపోయాడు.
Admin
Ekaburu