Ekaburu - క్రైమ్ / మేడ్చల్ : కెపిహెచ్ బి పరిధిలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లో తాను కార్పొరేటర్ అనుచరుడినంటూ హల్ చల్ సృష్టించాడు. తిన్న టిఫిన్ కు డబ్బులు అడిగిన పాపానికి హోటల్ నిర్వాహకురాలిపై దాడి చేయడంతో పాటు అడ్డు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ మీద పిడిగుద్దులు కురిపించాడు. మద్యం మత్తులో యువకుడు చేసిన వీరంగంపై మహిళ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. కె పి హెచ్ బి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఓ హోటల్ కు మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే యువకుడు ఆదివారం రాత్రి టిఫిన్ చేసేందుకు వచ్చాడు. చేసిన టిఫిన్ కు డబ్బులు అడిగినందుకు హోటల్ యజమానురాలిపై రెచ్చిపోయాడు. తాను కార్పొరేటర్ అనుచరుడినని, తనకు ఫ్రీ గా టిఫిన్ పెట్టాలంటూ హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్ తో దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డి అడ్డుకునేందుకు యత్నించగా, కానిస్టేబుల్ మీద పిడిగుద్దులు కురిపించాడు. యువకుడి వీరంగం పై హోటల్ యజమానురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.
Also Read : మియాపూర్ సర్వే నంబర్ 44లో ప్రభుత్వ భూమి కబ్జా
Admin
Ekaburu