Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 44లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. కబ్జాదారులు ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ప్రభుత్వ భూమి కబ్జా తతంగాన్ని శేరిలింగంపల్లి తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లిన జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి కబ్జాలను అరికట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. మియాపూర్ సర్వే నెంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ, కబ్జాలపై శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 44లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత శేరిలింగంపల్లి రెవెన్యూ కార్యాలయం పై ఉందన్నారు.
Also Read : జెనెసిస్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
మియాపూర్ బస్ బాడీకి అనుకోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒకే చోట 2 ఎకరాల విస్తీర్ణంలో కబ్జా చేసి, కాంపౌండ్ వాల్, గదుల నిర్మాణం చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని అన్నారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విద్యుత్ శాఖ గతంలో ఇచ్చిన మీటర్లను వెనక్కు తీసుకువెళ్లిందని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమి కబ్జాపై ఆధారాలతో జనం కోసం పిర్యాదు చేస్తుందని, రెవెన్యూ యంత్రాంగం స్పందించి కబ్జాలను తొలగించడంతో పాటు మరోసారి ఇటువంటి ప్రయత్నం జరుగకుండా కబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
Ekaburu