Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : యువత భవిష్యత్తు కోసం నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, నేడు తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ మియాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి యలమంచి ఉదయ్ కిరణ్ ఆద్వర్యంలో మియాపూర్ జెపి నగర్ కి చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన బి.ప్రసాద్, మనోజ్, జి.వెంకటేశ్, ఎల్.సుందర్, వినయ్, నవీన్, జగదీష్, ఆనంద్, గణేష్, మనోజ్, మహేష్, హరీష్ తదితరులను జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువాలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. శేరిలింగంపల్లిలో సంక్షేమ ఫలాలు పేదలకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, నియోజకవర్గ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, వీరేందర్ గౌడ్, సయ్యద్ గౌస్, శేఖర్ ముదిరాజ్, అక్తర్, శ్రీనివాస్ గౌడ్, పట్వారీ శశిధర్, సుదర్శన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu