Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాయదుర్గం గోర్రెంక బస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపును సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఖాజాగూడ ఎస్సీ బస్తీలోని పోచమ్మ దేవాలయంలో స్థానికులతో కలిసి పూజలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్ లోని రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు మాజీ కార్పొరేటర్ సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని అన్నారు.
శేరిలింగంపల్లి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దారుగుపల్లి నరేష్, గణేష్, భేరి రామచందర్ యాదవ్, నర్సింహరావు, క్రిష్ణా యాదవ్, ప్రభాకర్, సాయిబాబు, రాహుల్, యాదయ్య, శేఖర్, వెంకట్ రెడ్డి, నారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu