Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవాటు చేసుకోవాలని స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత అన్నారు. లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు అశోక్ నేత ముఖ్య అతిథిగా హజరయ్యారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన వికాలాంగుడు వెంకటయ్యకు వీల్ చైర్ నిమిత్తం 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు హోప్ ఫౌండేషన్ ముందుకు రాగా, శనివారం మేజిస్ట్రేట్ అశోక్ చేతుల మీదుగా చెక్కును వెంకటయ్యకు అందజేశారు. అనంతరం ప్రతి శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లభ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ వ్యవస్థాపకుడు కొండా విజయ్ కుమార్ తో కలిసి మేజిస్ట్రేట్ అశోక్ నేత ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
Also Read : వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేవు
ఈ సందర్భంగా అశోక్ నేత మాట్లాడుతూ గత 73 వారాలుగా ప్రతి శనివారం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ను అభినందించారు. పేద విద్యార్థుల చదువుల కోసం, పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కోసం హోప్ ఫౌండేషన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ అధ్యక్షుడు తొపుగుండ మహిపాల్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Admin
Ekaburu