Wednesday, 22 April 2026 05:00:51 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

సోమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా

సాయిబాబా ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ

Date : 09 March 2024 04:12 PM Views : 870

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర దేవస్థానం చైర్మన్ పురం విజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా ప్రత్యేక పూజలు, స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సోమేశ్వర స్వామి దేవస్థానం పూజల్లో పాల్గొన్న భక్తులకు మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Also Read : కొండాపూర్ లో శక్తి వందన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నల్లగండ్ల సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఈ పూజలకు పరిసర ప్రాంతాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అన్నారు. మహా శివరాత్రికి ఉపవాసం, జాగరణ ఉండే భక్తులకు మరుసటి రోజు అన్నసమారాధన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సోమేశ్వర స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం తన అదృష్టమని, గచ్చిబౌలి డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజల్లో సాయిబాబాతో సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పురం విజేందర్ రెడ్డి, సభ్యులు, చెన్నం రాజు, ఆకుల యాదగిరి, గిరి, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :