Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : ఓ వైపు రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తూ రాష్ట్రంలోని రిజర్వాయర్లు నిండుతుండగా, అధికారులు మాత్రం హైటెక్ సిటీ వాసులకు ఎండాకాలంలో ఏర్పడిన మంచినీటి సమస్యను నెలలు గడుస్తున్నా పరిష్కరించకపొవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహించారు. మాదాపూర్ సాయి నగర్ తో పాటు హరిజన బస్తిలో గత రెండు నెలల నుంచి మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుండడంతో స్థానికులు శుక్రవారం మాదాపూర్ జలమండలి కార్యాలయంలో ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనపై సమాచారం అందుకున్న మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేపీ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్ జలమండలి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్దతు తెలిపారు.
Also Read : ఇంజనీరింగ్ విద్యార్థికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ప్రోత్సాహం
కార్యాలయంలో ఉన్న జలమండలి మేనేజర్ యాదగిరి తో రాధాకృష్ణ యాదవ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సాయి నగర్ వాసుల గత రెండునెలలుగా మంచినీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేటికి సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. సాధ్యమైనంత త్వరగా మంచినీటి సమస్య ను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజులలో రెండు విజిట్స్ చేసి సమస్యను పరిష్కరిస్తానని వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో బస్తివాసులు నర్సింహా, సుభాని, ఆనంద్,శివ, కుమార్ స్వరూప, నాగేశ్వరరావు, లక్ష్మణ్,గోపాల్, రాజు, ఉపేందర్, సంపాన్ లాల్, నిరంజన్, వినయ్,రాజు, చిరంజీవి, జగతి దేవి, స్వరూప,నాగేశ్వరరావులతో పాటు పలువురు బస్తివాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu