Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దొంగల్లా పార్టీలు మారడం కాదని, బిఆర్ఎస్ పార్టీతో వచ్చిన తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నాయకుడు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారాస నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు పోయినా వచ్చిన నష్టమేమి లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే వారికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సైతం ఆయా నియోజకవర్గాలోని సొంత పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
నియోజకవర్గాల్లో భారాస నేతలు, ఉద్యమకారులు గతంలో సదరు నాయకుల తీరుతో ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. మెరుపు వేగంతో భారాస పుంజుకుంటుందని, రానున్న అన్ని ఎన్నికల్లో భారాస సత్తా ఎంటో చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలు మారిన వారిని ప్రజా సమస్యలపై నిలదీస్తామని, ఎంతటి వరకైనా పోరాటం కొనసాగిస్తామంటూ రవీందర్ యాదవ్ హెచ్చరించారు. పార్టీలు మారుతున్న వారికి కేసీఆర్, కేటీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కేటీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Admin
Ekaburu