Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో కోమటికుంట కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కోమటికుంట చెరువు కట్ట మీద నూతనంగా నిర్మించిన దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read : మంచినీటి సంపులో పడి ఐటీ ఉద్యోగి మృతి
ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అన్నారు.అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం అన్నారు.
ప్రజలపై అమ్మవారి చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపన్ పల్లి, ఎన్టీఆర్ గర్,తాజ్ నగర్,సోఫా కాలనీ వాసులు, భక్తులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu