Sunday, 01 March 2026 11:26:21 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

గోపన్ పల్లిలో ఘనంగా కట్ట మైసమ్మ విగ్రహా ప్రతిష్టాపన

గ్రామ దేవతలను పూజించుకోవడం తెలంగాణ సంస్కృతిలో భాగం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 22 April 2024 10:35 PM Views : 3001

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో కోమటికుంట కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కోమటికుంట చెరువు కట్ట మీద నూతనంగా నిర్మించిన దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : మంచినీటి సంపులో పడి ఐటీ ఉద్యోగి మృతి

ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అన్నారు.అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టకరం అన్నారు.

ప్రజలపై అమ్మవారి చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపన్ పల్లి, ఎన్టీఆర్ గర్,తాజ్ నగర్,సోఫా కాలనీ వాసులు, భక్తులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :