Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన శేరిలింగంపల్లి సర్కిల్ లో అస్థి పన్ను వసూళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీపీఏం నాయకులు వాపోయారు. కొంతమంది అవినీతి అధికారుల కారణంగా కోట్లాది రూపాయల ప్రాపర్టీ టాక్స్ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఆస్థి పన్ను మదింపు లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఏం శేరిలింగంపల్లి జోన్ కమిటీ సభ్యులు జోనల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.
Also Read : పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలి : కొమిరిశెట్టి సాయిబాబా
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సీపీఏం జోన్ కమిటీ కార్యదర్శి చల్లా శోభన్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి సర్కిల్20 పరిధిలో గచ్చిబౌలి డైమండ్ హిల్స్ ప్రధాన రహదారి మీద ఉన్న ఓం మార్బుల్, లార్డ్స్ ఫర్నిచర్, కార్ లాంజ్, హుందాయ్ షోరూం, ఉడిపి హోటల్, హోల్సర్ హోటల్ తదితర వాణిజ్య సముదాయాల ప్రాపర్టీ టాక్స్ మదింపు లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. లార్డ్స్ ఫర్నిచర్ సముదాయం 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, కేవలం 500 చదరపు అడుగుల విస్తీర్ణం కు మాత్రమే పన్ను మదింపు చేశారని అన్నారు.
ఇటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని, దీని కారణంగాప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయని అన్నారు. డైమండ్ హిల్స్ లో ఎటువంటి వాణిజ్య సముదాయానికి అనుమతి లేకపోయినా, భారీ వ్యాపార కేంద్రాలు వెలిశాయని అన్నారు. గచ్చిబౌలి డైమండ్ హిల్స్ లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిర్యాదు చేసిన వారిలో శోభన్ తో పాటు జోన్ కమిటీ సభ్యుడు కె.కృష్ణ ఉన్నారు.
Admin
Ekaburu