Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా చందానగర్ రాజీవ్ గృహకల్ప నల్ల పోచమ్మ గుడి పూజాకార్యక్రమాలకు సోమవారం కసిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ధర్మకర్త, కాంటెస్టెడ్ కార్పొరేటర్ శివకుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, తల్లి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటునట్టు తెలిపారు. ఆషాడ,శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని, బోనమెత్తుకునే తెలంగాణ మహిళలు ఈ దేశ సాంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
Ekaburu