Sunday, 01 March 2026 12:55:02 PM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

మియాపూర్ సర్వే నెంబర్ 100లో బహుళ అంతస్థుల నిర్మాణాలు

ప్రభుత్వ భూమిని రక్షించాలని జనంకోసం పిర్యాదు

Date : 18 March 2024 12:52 AM Views : 823

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించి భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గతకొన్ని రోజుల క్రితమే మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించాలని జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధికారుల దృష్టికి తెలుకువెళ్లింది. రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులతో పాటు రాష్ట్ర మంత్రుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కానీ అధికారుల్లో చలనం లేకపోగా, కబ్జాదారులు మరింత చెలరేగిపోతున్నారు. తాజాగా మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపడుతున్న భారీ బహుళ అంతస్థుల నిర్మాణం విషయాన్ని జనంకోసం మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.

Also Read : జెఎన్టీయూలో ఈనెల 30,31న ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు

ఈ కబ్జాపై హెచ్ఎండీఏ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహశీల్దార్ లకు శనివారం జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి మాట్లాడుతూ మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఉన్న భూమిని హైకోర్టు ప్రభుత్వ భూమిగా తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఈ భూమిపై స్టెటస్ కో తీర్పు ఇచ్చిందన్నారు. హెచ్ఎండీఎ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాపాడడంలో అధికారులు వైఫల్యం చెందారని లోకాయుక్త మెట్టికాయలు వేసినా అధికారులు నిద్రమత్తు వీడడం లేదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతుంటే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని అధికారుల తీరుపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. మియాపూర్ ప్రశాంత్ నగర్ లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :