Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. శేరిలింగంపల్లి ఇంజినీరింగ్ విభాగం అధికారులు, స్థానిక నాయకులు, గోపన్ పల్లి తండా బస్తీ వాసులతో కలిసి రహదారి పనులను పరిశీలించడంతో పాటు స్థానికంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Also Read : సోమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా
సీసి రోడ్డు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెలుకురావాలని అధికారులకు సూచించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేస్తున్నామని, గచ్చిబౌలి డివిజన్ ను గ్రేటర్ హైదరాబాద్ లోనే ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, శ్రీనివాస్, శేఖర్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, ప్రకాష్, వేణు, కృష్ణ, మహేష్ నాయక్, వర్క్ ఇనిస్పెక్టర్ లక్ష్మణ్, గోపనపల్లి తండా వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu