Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అనే నినాదంతో పార్టీలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను చేరువ చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, డివిజన్ లో తమ పనితీరుకు ఆకర్షితులై నేడు ఎంతోమంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బిజెపిలో చేరుతున్నారని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మునియప్ప, శంకర్, రాజు, మానస్, కరుణాకర్, విఠల్ తదితరులు బుధవారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గోపన్ పల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి గంగాధర్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అతి తక్కువ కాలంలోనే చేసి చూపించిందని అన్నారు. ప్రజా సంక్షేమం,అభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకి లేదన్నారు. బీజేపీ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, మన్నే రమేష్, రాజు , గోపాల్ ప్రభాకర్, సురేష్, రాజు, నగేష్ ,వెంకట్, మని, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu