Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునివ్వడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను పోలీసులు గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. మొదట హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సాయిబాబాను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయిబాబా అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రేణులు భారీ ఎత్తున రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
Also Read : ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?
ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచడం హేయమన్నారు. ఓవైపు ఉచిత ప్రయాణం అంటూ హామీలు ఇచ్చి, మరోవైపు చార్జీలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించేంతవరకు బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని, అందుకోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని అన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయిబాబాను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, దారుగుపల్లి నరేష్, రాజు ముదిరాజ్, ఆకుల యాదగిరి, రమేష్ గౌడ్, అనిల్ సింగ్, శామ్లెట్ శ్రీనివాస్, అజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Admin
Ekaburu