Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామరక్ష అని, పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం నేటితరం మీద ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డోయెన్స్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సర్కిల్ డెప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, ఏఎంఓహెచ్ నగేష్ నాయక్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ కాలనీలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వ్యర్థాల తొలగింపు, రెండవ రోజు దోమల నివారణ, మూడవ రోజు చెరువుల సంరక్షణ, నాల్గవ రోజు నాలల క్లినింగ్, ఐదవ రోజు వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని సూచించారు.
Also Read : పైసా పైసా కూడబెట్టి కొన్న ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారు : కొల్లూరు లక్ష్మీపురం కాలనీవాసులు
కాలనీల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి, దోమల నిర్వహణకు చర్యలు తీసుంటామని, చెరువులను సంరక్షణ కార్యక్రమలు, నాలల క్లినింగ్, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు చెప్పటి కాలనీ లను సుందర శోభిత వనంలుగా తీర్చిదిదిద్దుతామని అన్నారు. కాలనీల అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, సామాజిక వేత్తలు సంఘటితమైతే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఆదర్శవంతమైన, సుందరవనంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా,అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలన్నారు. మొక్కలు నాటాడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత సైతం తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఏంసీ ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, యూబిడీ డైరెక్టర్ అనిల్, మేనేజర్ విక్రమ్ చంద్రతో పాటు నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu