Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చందానగర్ కు చెందిన శ్రీకృష్ణ భక్తురాలు వి.అనూరాధ మంగళవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో అనురాధ బీజేపీలో చేరగా, పార్టీ కండువాతో భాస్కరరెడ్డి ఆహ్వానించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ద్వారానే సనాతన ధర్మం కాపాడబడుతుందని, మరోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసే లక్ష్యంతో బిజెపిలో చేరినట్లు అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని, ఈ దఫా 400 పైచీలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బొక్క బాల్ రెడ్డి, గూడూరి త్రినాథ్, నందనం వినయ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాయదుర్గంలో నకిలీ పోలీస్ అరెస్టు
Admin
Ekaburu