Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : హిందుత్వం అనేది ఒక మతం కాదని, దేశంలోని అన్ని వర్గాలను కలిపే ఒక వారధి అని బిజెపి చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని విస్పర్ వ్యాలీలో కాలనీ వాసులతో కొండా విశ్వేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ హిందుత్వం మీద ఎంతోమంది ఎన్నో చెప్తుంటారని, కానీ ఆర్ఎస్ఎస్, విహెచ్ పి వంటి సంస్థలు హిందు ధర్మ సంరక్షణ కోసం పాటుపడుతున్నాయన్నారు. రామమందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల అని, ఆ కలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సాకారం చేశారన్నారు.
Also Read : బీజేపీ హయాంలో నయా భారత్ ఆవిష్కరణ: కొండా విశ్వేశ్వరరెడ్డి
రామమందిర నిర్మాణం కోసం కోట్లాది మంది ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేశారని, కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఈ మహత్తర ఘట్టంలో పాలుపంచుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కేంద్రంలో మరోసారి బిజెపి అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారనేందుకు గత పదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. చేవెళ్లలో బిజెపిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, ప్రధాని మోడీకి కానుకగా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Ekaburu