Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటి. రామారావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం గచ్చిబౌలి డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. చావుకు సైతం వెనుకాడకుండా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టారని అన్నారు.
Also Read : శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కండువా వార్
రాష్ట్ర ఏర్పాటు అనంతరం వెనుకబడిన తెలంగాణ ను తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువచ్చారని అన్నారు. రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఐటీ శాఖ మంత్రిగా కెటీఆర్ హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపారని, కెటిఆర్ ముందుచూపుతో ఐటీ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఐటీ కేంద్రంగా నిలిచిందని అన్నారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి ని చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu