Wednesday, 22 April 2026 05:03:51 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

Date : 14 March 2024 07:34 PM Views : 627

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువును ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గురువారం సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల్లో భాగంగా 2.74కోట్ల రూపాయల అంచనావ్యయంతో మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు పరిరక్షణ కోసం అభివృద్ధి పనులు చేపదుతున్నామని, చెరువులోమురుగు నీరు డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే డ్రైనేజీ పైప్ లైన్ పనుల వేగం పెంచాలని,,పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Also Read : రెండు రోజుల్లో ఈ ఫాస్టాగ్‌ సేవలు బంద్

చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఆహ్లాదాన్ని పంచే విదంగా చెరువు తీర్చిదిద్దాలని అన్నారు. చెరువు సుందరికరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచే పనులు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు చేపడుతామని అన్నారు. చెరువు సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం, చెరువు అలుగు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోయి, అపరిశుభ్రంగా ఉండడంతో స్థానికులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, దీంతో చెరువు సుందరీకరణకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో పాటు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :