Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువును ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గురువారం సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల్లో భాగంగా 2.74కోట్ల రూపాయల అంచనావ్యయంతో మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు పరిరక్షణ కోసం అభివృద్ధి పనులు చేపదుతున్నామని, చెరువులోమురుగు నీరు డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే డ్రైనేజీ పైప్ లైన్ పనుల వేగం పెంచాలని,,పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
Also Read : రెండు రోజుల్లో ఈ ఫాస్టాగ్ సేవలు బంద్
చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఆహ్లాదాన్ని పంచే విదంగా చెరువు తీర్చిదిద్దాలని అన్నారు. చెరువు సుందరికరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచే పనులు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు చేపడుతామని అన్నారు. చెరువు సంరక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం, చెరువు అలుగు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోయి, అపరిశుభ్రంగా ఉండడంతో స్థానికులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, దీంతో చెరువు సుందరీకరణకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో పాటు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu