Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో చేపడుతున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నానక్రాంగూడ గ్రామంలో పాదయాత్ర నిర్వహించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను సమీక్షించారు.
Also Read : రహదారుల మీద బైక్ రేసింగ్ లకు పాల్పడితే జైలుకే
భూగర్భ డ్రైనేజీ, మంచినీటి ఫైప్ లైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో రహదారులు నిర్మించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపట్టాలని శానిటేషన్ అధికారులకు సూచించారు. గత మూడున్నర సంవత్సరాల కాలంలోనే గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ది పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రజల మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
Ekaburu