Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : చిన్నోడని కవ్వించే ప్రయత్నం చేసిన శ్రీలంక ఫలితం అనుభవించింది. శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత్-ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రెండవ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్ల కవ్వింపు చర్యలతో చోటుచేసుకున్న వివాదానికి వైభవ్ తన బ్యాటింగ్ తో ఫైనల్ మ్యాచ్ లో సమాధానం చెప్పాడు. ఒకరకంగా తన ఉగ్రరూపం చూపించాడు. వైభవ్ బ్యాటింగ్ చేస్తుంటే బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్ తో 94 పరుగులు సాధించాడు. అయితే, సహన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యి వెనుదిరిగి కొద్దిలో సెంచరీ ని చేజార్చుకున్నాడు. కానీ అప్పటికే శ్రీలంక కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు.
Admin
Ekaburu