Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద అద్భుత విజయం సాధించి విజేతగా నిలిచినా... ట్రోఫీ ని మాత్రం అందుకోలేదు. ఆసియా కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకే ఇష్టపడని టీమ్ ఇండియా విజేత ట్రోపి ని పాకిస్థాన్ మంత్రి చేతుల మీదుగా అందుకునేందుకు నిరాకరించింది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ లేకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీనితో రాత్రి 12 గంటలకు మ్యాచ్ ముగిసినా బహుమతి ప్రదానోత్సవం అర్థరాత్రి ఒంటిగంట దాటినా ప్రారంభం కాలేదు. చివరికి కుల్దీప్ యాదవ్ మరియు తిలక్ వర్మలు స్టేజి మీద ఉన్న ఇతర ప్రముఖుల నుండి వారి వ్యక్తిగత అవార్డులను అందుకున్నారు.
Also Read : హెచ్ సి యు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా రన్నరప్ చెక్ను నఖ్వీ నుండి అందుకున్నాడు. ఆ తర్వాత వేడుక అకస్మాత్తుగా ముగిసింది. ఆసియా కప్ మొత్తం పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా కప్ ప్రెజెంటేషన్ లో పాకిస్థాన్ మంత్రి నుంచి ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించి కోలుకోలేని డబుల్ షాక్ ఇచ్చింది. భారత ఆటగాళ్లు తమ నిర్ణయంతో అభిమానుల మనసులు గెలిచారని పలువురు వ్యాఖ్యానించారు.
Admin
Ekaburu