Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ జరుపుకోవాలని హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కు స్వాతంత్ర్యం రాలేదని, 13 నెలల పాటు నిజాం పాలనలోనే కొనసాగిందని కేంద్ర హోంశాఖ మంగళవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది.
Also Read : రాయదుర్గంలో నకిలీ పోలీస్ అరెస్టు
సెప్టెంబరు 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత నగరం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి జ్వాల నింపడానికి, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ''హైదరాబాద్ విమోచన దినం'గా జరుపుకోవాలని నిర్ణయించింది
Admin
Ekaburu