Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : తాళం వేసి.. గొళ్లెం మరిచిన చందంగా ఉంది శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల వైఖరి. చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత లో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఖాజాగూడ పెద్ద చెరువును శిఖం స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో హడావిడీ చేసిన అధికారులు చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసి మధ్యలో ఉన్న గదిని మాత్రం వదిలేశారు. బుధవారం అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్టు ప్రకటించగా, తెల్లవారే సరికి కబ్జారాయుళ్లు దర్జాగా అదే గదిలో ఉంటూ కబ్జా స్థలాన్ని పొజిషన్ తీసుకున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి కబ్జాదారులు అక్రమ నిర్మాణం చేపట్టారు.
Also Read : తెలంగాణ ఓలింపిక్ అసోసియేషన్ బరిలో కొండా విజయ్ కుమార్
ఈ నిర్మాణం మీద పిర్యాదు అందుకున్న శేరిలింగంపల్లి జోనల్ అధికారులు కబ్జారాయుళ్లకు మొదట నోటీసులు జారీ చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఆదేశాలతో బుధవారం అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టారు. కాగా ఇక్కడే అసలు వింత చోటుచేసుకుంది. ఆక్రమించిన స్థలంలో చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్రీ కాస్ట్ ప్రహరీ గోడను కూల్చి, మధ్యలో ఉన్న గదిని మాత్రం చూసిచూడనట్టు వదిలేయడం వింతగా ఉంది. 24 గంటలు గడవక ముందే కబ్జాదారులు అదే గదిలో ఉంటూ పొజిషన్ తీసుకోవడం విశేషం. ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టి, అసలు నిర్మాణాన్ని పక్కనపెట్టి, కొసరు కట్టడాలు కూల్చివేయడం అనుమానాలకు తావిస్తోంది.
Admin
Ekaburu