Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్యానెల్ నుంచి జాయింట్ సెక్రటరీ పదవి కోసం కొండా విజయ్ కుమార్ నామినేషన్ వేశారు. నగరంలోని ఫతేమైదాన్ లో గల తెలంగాణ ఓలింపిక్ భవన్ లో గురువారం ఎన్నికల అధికారికి ఈ మేరకు కొండ విజయ్ కుమార్ నామినేషన్ ను అందజేశారు.
Also Read : చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో గోల్ మాల్...
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జూన్ 9వ తేదీన తెలంగాణ ఓలింపిక్ భవన్ లో జరగనున్నాయి. మాజీ ఏంపి జితేందర్ రెడ్డి ఆద్యక్షుడుగా పోటి చేస్తున్న ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీగా బరిలో నిలిచిన కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తనకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ర్టంలో క్రీడల అభివృద్దికి తనదైన శైలిలో కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Admin
Ekaburu