Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లకు రెండు కోట్ల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. చెక్కును అందజేసిన వారిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ టీజిఎఫ్డిసి చైర్మన్ పోదెం వీరయ్య, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ మేనేజర్ డా.జి. స్కైలాబ్, డిఎఫ్సి కిరణ్ కుమార్ లు ఉన్నారు.
Admin
Ekaburu