Wednesday, 22 April 2026 07:26:00 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరుల చైతన్యాన్ని ప్రదర్శిస్తాం : సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

Date : 05 August 2024 10:53 PM Views : 932

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సగరుల రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తామని తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. గచ్చిబౌలిలోని సగర సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సగర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీర్మానించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ ధన బలం లేక చట్టసభల్లో అడుగు పెట్టడానికి అవకాశం లేని తమ జాతి భవిష్యత్తు రాజకీయాలను శాసించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, జెడ్పి చైర్మన్ లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి మెజారిటీ స్థానాలలో విజయం సాధించడం కోసం తమ ప్రయత్నం కొనసాగిస్తామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న సగరులు రాబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సగరులకు మెజారిటీ స్థానాలలో అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సగరులను విస్మరించే ఏ రాజకీయ పార్టీనైనా ఓడించడం కోసం తమ ప్రయత్నం ఉంటుందని, సగరులను గుర్తించి అవకాశాలు కల్పించే ఏ రాజకీయ పార్టీనైనా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Also Read : పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది సగరులు రాజకీయంగా రాణించేందుకు త్వరలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వేలాది మందితో 'సగర చైతన్య సదస్సు' నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, ముఖ్య సలహాదారులు ఆర్.బి ఆంజనేయులు సగర, సగర ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర, ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, కోశాధికారి సాయి గణేష్ సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర, ప్రధాన కార్యదర్శి అతినారపు విజయలక్ష్మి సగర, కోశాధికారి సూర జయమ్మ సగర, రాష్ట్ర పాలకమండలి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :