Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి20కోట్ల రూపాయలు దోచుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెలుకువస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ వద్దని, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అడ్డగోలుగా మాట్లాడిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, వారంతా ఇప్పుడు నోరు ఎందుకు తెరవడం లేదు అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన తెలుగు నటి అరెస్ట్
ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అని నాడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Admin
Ekaburu